“ఈరోజుల్లో”, “బస్సు స్టాప్” లాంటి బూతు సినిమాలను జనం పైకి వదిలి యువతరాన్ని విపరీతంగా ఆకర్షించడమే కాకుండా సెన్సేషనల్ డైరెక్టర్ గా పేరుతెచ్చుకున్న దర్శకుడు మారుతి, తన ఇమేజ్ ను మార్చుకొనే పనిలో పడ్డాడు. అల్లు శిరీష్ హీరోగా మారుతి దర్శకత్వం వహిస్తున్న “కొత్త జంట” సినిమా నిన్న ప్రారంభం అయింది. ఈ సినిమా తన గత చిత్రాలకు భిన్నంగా ఉంటుందని మారుతి చెపుతున్నాడు. అమ్మాయి- అబ్బాయి ప్రేమించుకున్నా ఆ వెనుక ఉన్న డబ్బు కోసం ఎన్ని స్వార్ధపూరితమైన పనులు చేస్తారో అన్న కధాంశం ఈ సినిమా కధ అట.

ప్రస్తుత యంగ్ జనరేషన్ అమ్మాయిలు, అబ్బాయిలు ఎలా ఆలోచిస్తున్నారు..? అనే విషయం ఈ సినిమాలో ఉంటుందని మారుతి చెపుతున్నాడు. మనిషి స్వార్ధం తారాస్థాయికి వెళ్ళిపోతే జీవితాలు ఏమైపోతాయి అనే సామాజిక విషయాన్ని ఈ సినిమాలో చూపెడతాడట. అయితే ఇన్ని విషయాలు బూతు ప్రస్తావన లేకుండా మారుతి యువతరానికి నచ్చే విధంగా ఈ సినిమా తీయ్యగలుగుతాడా అన్నదే ప్రశ్న.


మారుతి సినిమా అనగానే నేటి యువతరం ఏవేవో ఊహించుకుంటూ ధియేటర్ లోకి వెళ్ళిపోతారు. మరి అవేవి కనిపించకపోతే నేటి తరం ప్రేక్షకులు మారుతి సినిమాను హిట్ చేస్తారా..? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇప్పటికే మొదటి ప్రయత్నం తో ఘోరంగా దెబ్బతిన్న అల్లు శిరీష్ భవితవ్యాన్ని ఈ సినిమా ద్వారా మారుతి ఎలా మారుస్తాడో చూడాలి.వేచి చూద్దాం......
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: