“భారతదేశం ఒక కపట సమాజం. అక్కడ పురుషులతో పోలిస్తే మహిళలు సమాజంలో అట్టడుగున ఉంటారు. భారత్ మహిళలకు తిరోగామి దేశం”. ఈ మాటలు అన్నది ఎవరో కాదు వెండితెరపై మొట్టమొదటి చుంబన దృశ్యంలో నటించి, బికినీ లలో కనిపించే మల్లికా షెరావత్. ఈమధ్య కాన్స్ లో జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవం వేదికగా వెరైటీ అనే పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో మల్లికా షెరావత్ మాట్లాడిన ఈ మాటలకు భారతదేశంలో తీవ్ర నిరసనలు రావడమే కాకుండా ఆమె పై మీడియా దుమ్మెత్తి పోస్తోంది.

 మల్లిక మాటలను బాలీవుడ్ మరో హాట్ బ్యూటీ ప్రియాంకా చోప్రా తీవ్రంగా ఖండించడమే కాకుండా “మనది ఒక పురోగామి దేశం. మల్లికా అంటున్నట్లుగా భారత్ ను తిరోగామి దేశంగా నేను అనుకోవడం లేదు” అంటూ ప్రకటనలు గుప్పిస్తోంది. యునిసెఫ్ రూపొందించిన ఒక మొబైల్ అప్లికేషన్ ఆవిష్కరణ సభలో మల్లికా షెరావత్ మాటలకు ప్రియాంకా ఘాటుగా సమాధానం ఇచ్చింది. ఈ మాటల యుద్ధం చేసుకున్న ఈ బాలీవుడ్ హీరోయిన్స్ ఇద్దరూ హాట్ బ్యూటీ లే కావడం గమనింపదగ్గ విషయం.
సినిమాలలో నటించడమే కాకుండా అంతర్జాతీయ వేదికలపై తన ఇష్టం వచ్చినట్లు మన సెలబ్రిటీలు మన దేశం గురించి, మన సంస్కృతి గురించి వారికి తెలిసినా తెలియకపోయినా మాట్లాడుతూ వాళ్ళ ట్విట్టర్ లలో పెడితే చాలు విరగపడి చదివేస్తున్నారు మనవారంతా. సెలబ్రిటీలు అంటే మాటా మజాకా...!  

మరింత సమాచారం తెలుసుకోండి: