నేడు రిలీజ్ అయిన ఇద్దర్మాయిలతో మూవీ థియోటర్లలో హల్చేస్తుంటే, ఈ మూవీపై వచ్చిన డివైడ్ టాక్ కొంత మంది గుండెల్లో హార్ట్బీట్ను పెంచుతుంది. పూరి పూర్, బన్నీ బోర్ అంటూ సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ హల్చల్ చేస్తుంటే మొత్తంగా ప్రేక్షకులు మాత్రం కన్ప్యూజన్లో పడిపోయారు. పూరీ మాత్రం మాత్రం ఇది మాములే అంటూ తాపీగా ఉంటున్నాడు. ఇంతకీ బన్నీపై కోటిన్నర రూపాయలను పెట్టుకొని కూర్చున్నది ఎవరంటారా.
ఈ లేక్కేంటో ఓ సారి చూద్దాం. వరల్డ్ వైడ్గా రిలీజ్ అయిన ఇద్దరమ్మాయిలు మూవీ, థియోటర్లలో అభిమానుల నోటి వెంట కేకలు పుట్టిస్తుంది. సినిమా ప్లే అయ్యేటప్పుడు, మూవీ స్టార్ట్ అయ్యే ముందు, ఇంటర్వెల్ మధ్యలో వచ్చే 30 సెకన్ల యాడ్ ఖరీదు అక్షరాల కోటి యాబై లక్షలు అంట. ఆంద్రప్రదేశ్లో ఎన్ని థియోటర్లలో ఆడుతుందో, అన్ని థియోటర్లలో ఈ యాడ్ ప్లే అవుతుంది.కేవలం 30 సెకన్ల యాడ్ ప్రమోషన్ ఈ బన్నిను నమ్ముకొని ఖర్చుపెడుతున్న డబ్బున్నోళ్ళ పాజిటివ్ థింకింగ్ రివర్స్ అయింది.
మూవీ డివైడ్ టాక్ రావడంతో యాడ్ రూపంలో మూవీ పై ఇన్వెస్ట్ చేసిన బిజినెస్ పర్సెన్స్ హార్ట్ బీట్ టాప్ గేర్లో వెళుతుంది. ఇదంతా నెల రోజుల కాంపెయిన్. ఈ విషయం వెలుగులోకి రావడంతో తెలుసుకున్న వారు ముక్కున వేలు వేసుకుంటున్నారు.