పూరీ జగన్నాథ్ మళ్లీ వార్తల్లోకి వచ్చాడు. అతను దర్శకత్వం వహించిన తాజా సినిమా ఇద్దరమ్మాయిలతో.. నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమాకు  భారీ ఓపెనింగ్స్ వస్తున్నాయి. ఈ సినిమాపై టాక్ ఎలా ఉన్నా.. పూరీ డైలాగ్స్ కు మాత్రం మంచి రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గురించి, కులాంతర వివాహం గురించి రాసిన డైలాగ్స్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది.

ఈ సినిమాలో ఒక సన్నివేశంలో ‘ప్రపంచంలో ప్రతీ వెధవా పవన్ కళ్యాణ్ ఫ్యానే..’ అనే డైలాగ్ ఉంది. ఈ డైలాగ్ తో పవన్ కళ్యాణ్ పై పూరీ సైటర్ వేసాడనే అంతా భావిస్తున్నారు. ఈ డైలాగ్ మెగా అభిమానులను సంతృప్తి పరిచేటట్లు ఉన్నా... ‘వెధవలే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్’ లేక ‘పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా వెధవలే’ అని ఈ డైలాగ్ తో అర్థం వస్తుందని, పూరీ జగన్నాథ్ కావాలనే పవన్ కళ్యాణ్ పై ఈ విధంగా సెటైర్ వేశాడని చాలా మంది భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: