తెలుగులో ఘ‌న విజ‌యం సాధించిన చిత్రం ల‌క్ష్మి. వెంక‌టేష్ - వినాయ‌క్ క‌ల‌యిక‌లో వ‌చ్చిన ఈ సినిమా కుటుంబ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకొంది.  న‌య‌న‌తార‌, ఛార్మి క‌థానాయిక‌లుగా న‌టించారు. ఇప్పుడీ చిత్రంపై క‌న్న‌డ హీరో ఉపేంద్ర దృష్టి ప‌డింది. ఈసినిమా రైట్స్ చేజిక్కించుకొని... క‌న్న‌డ‌లో గౌరీ గా రాబోతున్నారు. అయితే ద‌ర్శ‌కుడు. క‌థానాయికలు ఎవ‌ర‌నే విష‌యం ఇంకా ఓ కొలిక్కి రాలేదు.

ఉపేంద్ర‌కు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. ఆమ‌ధ్య వ‌చ్చిన సూప‌ర్ సినిమా... తెలుగు ప్రేక్ష‌కుల‌నూ ఆక‌ట్టుకొంది. మ‌రి ఈ గౌరీ కూడా తెలుగులో వ‌స్తుందా?  అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: