బాహుబ‌లిలో ప్ర‌భాస్‌తో ఢీ కొడుతున్నాడు రానా. మ‌రోవైపు రాణి రుద్ర‌మ‌లోనూ న‌టిస్తున్నాడు. అయితే ఈ రెండింటిలోనూ ఆయ‌న‌వి రెండో ప్రాధాన్యం ఉన్న పాత్ర‌లే. మెయిన్ లీడ్ కాదు. ఇలాగైతే సోలో హీరోగా ఎద‌గ‌డని సురేష్‌బాబు భ‌య‌ప‌డిపోతున్నారు. అందుకే కొడుకు కోసం క‌థ‌లు వెదుకుతున్నారు. బాలీవుడ్‌లో ఘ‌న విజ‌యం సాధించిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయ‌ర్ సినిమాని తెలుగులో రీమేక్ చేయ‌డానికి ఆయ‌న స‌న్నాహాలు చేస్తున్నారు. క‌ర‌ణ్‌జోహార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్ర‌మ‌ది. ఈ సినిమాని తెలుగులో ఎవ‌రి చేతిలో పెట్టాలా?  అని స‌రైన దర్శ‌కుడి కోసం అన్వేషిస్తున్నారు.

ఇందులో ఇద్ద‌రు హీరోలుంటారు. అందుకే రానాతో పాటు మ‌రో హీరో కూడా కావాలి. ఆ అవ‌కాశం ఎవ‌రికి ద‌క్కుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: