నిన్న విడుదలైన పూరి జగన్నాద్ ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమాలోని కేథరిన్ డైలాగ్ ను బట్టి ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందా అనే అనుమానం ప్రేక్షకులలో కలుగుతుంది. ఈ సినిమాలో  ఒక అమ్మాయి గా నటించిన కేథరిన్ మరో అమ్మాయి అమలాపాల్ ను చూస్తూ ‘ఎప్పుడైనా సరే మీరు విడిపోక తప్పదు సెకండ్ ఆఫ్ లో మళ్ళీ నేను వస్తా’ అంటూ వెళ్ళిపోతుంది. ఈ డైలాగ్ విన్న ప్రేక్షకులకు ఈ సినిమాకు సీక్వెల్ ఉందా అని అయోమయంలో పడేస్తుంది.

దర్శకుడు పూరి పవన్ కళ్యాణ్ తో మొట్టమొదటిగా చేసిన ‘బద్రీ’ సినిమాలో కూడా ఇటువంటి డైలాగ్ ఉంటుంది. ఆ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించిన రేణుదేశాయ్, మొదటి హీరోయిన్ అమీషా పటేల్ వంక చూస్తూ సినిమా చివరిలో ‘సవితి పోరుకు రెడీ గా ఉండు’ అంటూ నవ్వుతూ వెళ్ళిపోతుంది. ఆరోజులలో ఆ సినిమా చూసిన వారంతా ఈ సినిమాకు ఉంటుంది అనుకున్నారు కానీ రాలేదు
.

పూరి జగన్నాద్ తన సినిమాలకు సీక్వెల్ చేద్దామనే కోరిక ఇప్పటిది కాదు ‘బిజెనెస్ మేన్’ హిట్ అయ్యాక ఆ సినిమాకు సీక్వెల్ చేద్దామని అనుకున్నాడ, అది జరుగలేదు. దాని తరువాత రవితేజా ‘ఇడియట్’ సినిమాకు సీక్వెల్ అన్నారు అదీ జరుగ లేదు. సెంటిమెంట్ గా కలిసి వస్తుందని పూరి సీక్వెల్ కు సంబందిచిన డైలాగ్స్ అప్పుడప్పుడు వాడతాడు కాబోలు. ఇప్పుడు కూడా ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుంది అని గంపెడు ఆశతో డైలాగ్ చెప్పిన కేథరిన్ కల నెరవేరేది ఎప్పుడో మరి....  

మరింత సమాచారం తెలుసుకోండి: