డి.రామానాయుడు...తెలుగు సినిమాను కొత్త పుంతలు తొక్కించిన నిర్మాత. ఎంతో మంది కొత్త దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేసి అత్యధిక సినిమాలు చేసిన నిర్మాతగా గిన్నిస్ రికార్డ్ క్రియేట్ చేసిన ఘనత నాయుడిగారికే సొంతం. అయితే ఈ మద్య పెద్ద సినిమాలను ప్రొడ్యూస్ చేయడం పూర్తిగా తగ్గించిన నాయుడుగారు ఇపుడు ఓ మసాలా సినిమా చేస్తున్నారు. మళ్లీ నాలుగు రాళ్లు సంపాదించి తన బ్యానర్ ని రీచార్జ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
సొంతవూరు, గంగపుత్రులు సినిమాలతో నంది అవార్డ్స్ అందుకున్న సునీల్ కుమార్ రెడ్డి డైరెక్షన్ లో నేనేం చిన్న పిల్లనా అనే టైటిల్ తో ఈ సినిమా రూపొందుతుంది. ఈ సినిమాలో రాహుల్ , వ్యాస్ హీరోహీరోయిన్స్ గా నటిస్తున్నారు. వాస్తవానికి సురేష్ ప్రొడక్షన్ లో ఈ మద్య వస్తున్న యూత్ ఫుల్ రోమాంటిక్ ఫిల్మ్ ఇదే . విశేషం ఏంటంటే సునీల్ కుమార్ రెడ్డి కూడా మొదట అవార్డ్స్ పిక్చర్ చేసి తరువాత పంధా మార్చి ఒక రోమాంటిక్ ప్రేమ కధా చిత్రం అనే ఓ బూతు సినిమా చేసి నాలుగు రాళ్లు సంపాదించారు.
ఇపుడు నాయుడుగారి కూడా ఐదు రాళ్లు సంపాదించి పెడదామని ఈ సినిమా చేసి పెడుతున్నారట. అమ్మాయిలు..యుక్తవయస్సులో తీసుకునే తొందరపాటు నిర్ణయాలే ఈ సినిమా కధ అట. ఇంకేం మసాలా సీన్స్ మస్తుగా వుంటాయన్నమాట.. ఈ మద్యే రిలీజైన ఈ సినిమా స్టిల్స్ చూస్తుంటే ఆ విషయం అర్దమైపోతుంది కూడా. మరి నాయుడిగారి బ్యానర్ లో రూపొందిన ఈ హాట్ ఫిల్మ్ చూడాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.