ప్రభాకర్ రెడ్డి నటుడుగానే కాకుండా కథారచయితగానూ రాణించారు. ‘పండంటి కాపురం’, ‘పచ్చని సంసారం’, ‘ధర్మాత్ముడు’, ‘గృహ ప్రవేశం’, ‘గాంధీ పుట్టిన దేశం’, ‘కార్తీక దీపం’, ‘నాకు స్వాతంత్ర్యం వచ్చింది’.. సినిమాలకు కథలను అందించారు. అంతేకాకుండా కృష్ణ హీరోగా నటించిన ‘ప్రతిభావంతుడు’, కృష్ణం రాజు హీరోగా వచ్చిన ‘ప్రచండ భారతం’ సినిమాలకు ప్రభాకర్ రెడ్డి దర్శకత్వం వహించడం విశేషం.
అలాగే ‘పండంటి కాపురం’ సినిమాతో జయసుధను, ‘నాకు స్వాతంత్ర్యం వచ్చింది’ సినిమాతో జయప్రదను సినిమా రంగానికి పరిచయం చేసిన ఘనత ప్రభాకర్ రెడ్డి కే దక్కుతుంది.