పూరీ జ‌గ‌న్నాధ్ ఏం చేసినా ఓ ట్రెండే. హిట్టైనా, ప్లాప్ అయినా మూవీను మ‌న‌స్సు పెట్టి చేస్తాడు. ప‌డ్డ క‌ష్టం క‌లెక్షన్ల రూపంలో కుమ్మరిస్తుందేమో అనుకొని ప్రతి మూవీకు సీక్వెల్ లూప్‌ను వ‌దిలేస్తాడు. ఈ మ‌ధ్య వ‌చ్చిన పూరి ప్రతి మూవీలో ఈ సీక్వెల్ సెట్ అయ్యేలా చివిరి సీన్లు ర‌డీ చేసుకుంటున్నాడు.

అలాగే లేటెస్ట్ మూవీ ఇద్దర‌మ్మాయిల‌తో కూడ చివ‌రిలో సీక్వెల్ ఉందంటూ లీడ్ ఇచ్చి వ‌దిలేస్తాడు. మొద‌టి ఇద్దర‌మ్మాయిల‌తోనే భ‌రించ‌లేని సినీ అభిమానులు, రెండోది వ‌స్తే భ‌య‌ప‌డిపోవ‌టం ఖాయం అంటున్నారు. అందుకే మూవీ మెత్తం చూసిన ప్రతి ప్రేక్షకుడు పూరి ఇచ్చిన సీక్వెల్ ట్విస్ట్‌ను చూసి బాబోయ్ అంటున్నారంట‌. దీనికే థియోట‌ర్లకు చేతులు కాలిపోతుంటే మ‌రో సీక్వెల్ అంటే సాహ‌సం చేసే డిస్ట్రిబ్యూట‌ర్లు ఉండ‌రంటున్నారు.

ఏదైమైనా పూరి ఇక‌నైన ఈ సీక్వెల్ గోల వ‌దిలేసి , మొద‌టి సినిమాను స‌రిగ్గా ప‌ట్టాలెక్కిస్తే చాలు అని ఇండ‌స్ట్రీ వాద‌న‌. పూరి ఇప్పటి వ‌ర‌కూ ఏ మూవీకు సీక్వెల్ తీయ‌లేదు. ఒక వేళ సీక్వెల్ అంటూ తీస్తే ప‌వ‌న్ క‌ళ్యాన్ న‌టించిన బద్రి మూవీతోనే స్టార్ట్ అవుదంటున్నారు పూరి స‌న్నిహితులు. మొత్తానికి సిని ప్రేక్షకులు మాత్రం రాజా...సీక్వెల్ వ‌ద్దు రాజా.. అంటూ బయ‌ట‌కు వ‌చ్చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: