మహేష్ బాబుకు తన కెరియర్ లోనే తొలి ఎదురుదెబ్బ తగిలింది. మహేష్ బాబు పేరు చెబితేనే చాలు అందరి ఎటెన్షన్ దక్కుతుందని భావించిన వారి కళ్లు బైర్లు కమ్మాయి. మేటర్ లేకపోతే మహేష్ బాబు కూడా పట్టించుకోమని జనాలు తేల్చి చెప్పారు. సూపర్ స్టార్ క్రిష్ణ కుమారుడైన మహేష్ బాబు బాలనటుడుగా సినిమా రంగ ప్రవేశం చేశాడు. మీసాల రాని వయస్సులోనే హీరో వేషాలు వేశాడు. తరువాత కొంత గ్యాప్ తీసుకుని ‘రాజకుమారుడు’తో పూర్తి స్థాయి హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అప్పట్నుంచి దూసుకుపోతునే ఉన్నాడు. సినిమా ఫ్లాఫ్ అయినా... మహేష్ ఫ్లాఫ్ కాలేదు. ప్రతీ సినిమాకు తన క్రేజ్ ను పెంచుకుంటానే వస్తున్నాడు. అయితే ఇటీవల కాలంలో మరింతగా ఎదిగిపోయాడు. దూకుడు, బిజినెస్ మ్యాన్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి వరస హిట్లతో దూసుకుపోతున్నాడు. ఈ సినిమాలు కేవలం మహేష్ క్రేజ్ తో హిట్టయ్యాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇలాంటి మహేష్ బాబు కు ఎదురుదెబ్బ తగిలింది. టాలీవుడ్ నెంబర్ వన్ గా ఎదిగిన మహేష్ బాబు ను జనం పట్టించుకోవడం లేదు.

మహేష్ బాబు సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న కొత్త సినిమా టీజర్, ఫస్ట్ లుక్ ను శుక్రవారం విడుదల చేశారు. ఈ టీజర్ కు పత్రికలు, వెబ్ సైట్లల్లో హడావుడే తప్ప అభిమానుల నుంచి, జనాల నుంచి రెస్పాన్స్ రావడం లేదు. చాలా మందికి ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసినట్లే తెలియదు. కొంత మందికి ఈ సినిమా టైటిల్ ఏమిటో అర్థం కాలేదు. ఈ సినిమా టైటిల్ ను కొంత మంది వన్ అని అనుకుంటే, మరికొంత ‘నేనొక్కడినే’ అని భావిస్తున్నారు. మహేష్ సినిమాకు ఇలా జరగడం అతని కెరియర్ లో ఇదే తొలిసారి. ఇటీవలే విడుదలఅయిన జూనియర్ ఎన్టీఆర్ ‘రామయ్య వస్తావయ్యా..’ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే మహేష్ సినిమాకు మాత్రం సరైన రెస్పాన్స్ రావడం లేదు.

అయితే ఇది మహేష్ బాబు తప్పిదం కాదని ఈ సినిమా టైటిల్ ను సరైన రీతిలో ప్రకటించకపోవడం, టీజర్ లో డైలాగ్ లేకపోవడంతోనే ఇలా జరిగిందని, దీనికి నిర్మాత, దర్శకులే బాధ్యత వహించాలని మహేష్ బాబు ఫ్యాన్స్ అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: