బ‌న్నీ ఇప్పుడే వ‌చ్చాడు. ఈ సినిమా ఫ్లాప్ ఊబిలో దిగిపోతుండ‌గానే - చ‌ర్రీ కూడా త‌న సినిమాని దించే ప‌నిలో ఉన్నాడు. ఈ వేస‌వికి తుఫాన్‌, ఎవ‌డు సినిమాల‌తో సంద‌డి చేద్దామ‌నుకొన్నాడు చెర్రీ. అయితే తుఫాన్ వివాదాల సుడిగాలిలో చిక్కుకొంది. ఈ సినిమా పూర్త‌యినా... ఇప్ప‌ట్లో విడుద‌ల చేసే అవ‌కాశాల్లేవు. దాంతో... ఎవ‌డుపై దృష్టి పెట్టాడు చ‌ర‌ణ్‌. ఈ సినిమాని వీలైనంత తొంద‌ర‌గా తీసుకొచ్చి... తుఫాన్ లోటును పూడ్చుకొందామ‌నుకొంటున్నాడు. ఈ సినిమాని జులై 5కి విడుద‌ల చేయాల‌ని నిర్మాత దిల్ రాజు భావిస్తున్నారు.

అన్నీ కుదిరితే.. త్వ‌ర‌లోనే పాట‌ల్ని విడుద‌ల చేద్దామ‌నుకొంటున్నారు. ఈ సినిమాలో బన్నీ అతిథి పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. ఎవ‌డు అయినా హిట్ట‌యితే... ఇద్ద‌ర‌మ్మాయిల‌తో సినిమాతో ఎదురైన ఓట‌మికి కాస్త‌లో కాస్త‌యినా ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: