ఈమధ్య సద్మాహ్మణుల మీద సెటైర్లు వేసి.. తమకు పిండాలెట్టించుకొనే పరిస్థితి వరకూ దిగజారారు కొంతమంది సినీ ప్రముఖులు. ఇప్పుడు పూరి జగన్నాథ్ ఆ లిస్టులో చేరిపోయాడు. ఈ సినిమాలో బ్రాహ్మణులపై కొన్ని సెటైర్లు ఉన్నారు. బ్రహ్మణులు మతం మారితే తప్పేంటి? అలా మారిన వాళ్లను బేపనీస్ అంటారు... అంటాడు బన్నీ ఓ సందర్భంలో.
అమలాపాల్ ఈసినిమాలో ఓ బ్రాహ్మణ అమ్మాయిగా నటించింది. ఆమె భాష మాత్రం అదోలా ఉంటుంది. ఉండేది చిక్కడ పల్లి - కానీ తూ.గో జిల్లా యాసలో మాట్లాడుతోంది. ఇదేం విడ్డూరమో అర్థం కాదు. రెడ్డీ, కాపు, కమ్మ... అంటూ కాస్ట్ ఫీలింగ్ లేవనెత్తి వాటి మీద ఓ చిన్నపాటి స్పీచ్ ఇప్పించాడు. అదెంత అవసరమా? అనిపిస్తుంది. రెడ్లు.. సూపర్ అంటూ వాళ్లను వెనకేసుకొచ్చాడు. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలంటూ.. ఈ సినిమా ఫ్లాప్ కి ఇవి కూడా తమ వంతు సాయం చేశాయి.