ఏ హీరో ఫంక్ష‌న్‌కి వెళ్తే... ఆ హీరోని వీరుడు, సూరుడు అంటూ పొడిడేస్తుంటారు దాస‌రి నారాయ‌ణ రావు. ఆయ‌న మంచి మ‌న‌సు అర్థం చేసుకోద‌గిన‌దే. ఈ మ‌ధ్య ద‌ర్శ‌కులకూ కితాబులు ఇచ్చేస్తున్నారు. మొన్న పైసా ఆడియో వేడుక‌లో కృష్ణ‌వంశీని ఆకాశానికి ఎత్తేశాడు దాస‌రి. ఇప్పుడు రాజ‌మౌళి వంతు వ‌చ్చింది. అంత‌కు ముందు - ఆ త‌ర‌వాత  ఆడియో వేడుక‌కు వ‌చ్చారు దాసరి.

ఈసంద‌ర్బంగా ద‌ర్శ‌కుల గురించి మాట్లాడుతూ ``మ‌న సినిమాలు త‌మిళంతోనూ, హిందీ సినిమాల‌తోనూ పోటీ ప‌డ‌డం లేదు. ఒకే మూస‌లో సినిమాలు తీస్తున్నారు. పాట‌ల్ని, లొకేష‌న్ల‌నూ మారుస్తున్నారు త‌ప్ప‌.. అదే క‌థ ఉంటుంది. క‌థ‌ను మార్చ‌గ‌ల‌వాడే నిజ‌మైన ద‌ర్శ‌కుడు. ఆ స‌త్తా ఉన్న‌వాడు రాజ‌మౌళి..`` అంటూ ఆకాశానికి ఎత్తేశాడు. ఈ పొగ‌డ్త‌ల కార్య‌క్ర‌మం వెనుక ఉన్న అస‌లు ఉద్దేశం ... దాస‌రికే తెలియాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: