టాలీవుడ్ లో ప్రముఖ దర్శకుల్లో గుణశేఖర్ ఒకరు. భారీ సెట్టింగులతో సినిమాలను రూపొందించడం ఈ దర్శకుడి ప్రత్యేకత. ఒక టైంలో వరుస హిట్లు తీసిన టాప్ హీరోల దృష్టిని కూడా తనవైపునకు తిప్పుకున్న ఈ దర్శకుడు ప్రస్తుతం హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. సరైన అవకాశాలు రాకపోవడంతో తనే సొంతంగా సినిమా నిర్మిస్తున్నాడు. ఈ దర్శకుడిగా ప్రతిభావంతడుగా ఎంత పేరు ఉందో.. నిర్మాతల చేత డబ్బును నీళ్ల మాదిరిగా ఖర్చు పెట్టిస్తాడనే విమర్శ కూడా ఉంది. కథకు అవసరం లేకపోయినా, ఆ సెట్ లేకుండా సినిమా తీసే అవకాశం ఉన్నా.. భారీ వ్యయంతో సెట్ లు నిర్మించడంతో గుణశేఖర్ కు ఈ పేరు వచ్చింది. గుణశేఖర్ తన సొంత సినిమాకు కూడా భారీ వ్యయంతో సెట్ ను నిర్మిస్తూ మళ్లీ వార్తల్లోకి వస్తున్నాడు.

అనుష్క ప్రధాన పాత్రలో ‘రాణీ రుద్రమదేవి’ అనే సినిమాను స్వీయదర్శకత్వంలో గుణశేఖర్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ చాలా వేగంగా జరుగుతుంది. అలాగే ఈ సినిమా కోసం తోట తరణి ఆధ్వర్యంలో వేయి స్తంభాల  గుడి సెట్ ను నిర్మించనున్నారు. ఈ సెట్ ను భారీ వ్యయంతో నిర్మించనున్నారు. రాణీ రుద్రమదేవి సినిమా చారిత్రాత్మక కథాంశంతో నిర్మిస్తున్న ఈ సినిమానే ప్రస్తుత పరిస్థితుల్లో బారీ వ్యయంతో సెట్ అవసరం లేదని చాలా మంది బావిస్తున్నారు. అత్యాధునికమైన గ్రాఫిక్స్ ను ఉపయోగించుకుని సెట్ అవసరం లేకుండానే సినిమాను అనుకున్న స్థాయిలో రూపొందించవచ్చని అయితే గుణశేఖర్ తన తీరు మార్చుకోకుండా ‘వేయిస్తంభాల గుడి’ సెట్ నిర్మాణానికి సన్నద్దం అవుతున్నాడని కామెంట్లు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: