మహానటుడు ఎన్టీఆర్ ను హీరోయిన్ అంజలీదేవి 12 సార్లు చెంపదెబ్బలు కొట్టిన సంఘటన ఒకసారి జరిగింది. 1950లో విడుదలయ్యిన ‘పల్లెటూరు పిల్ల’ సినిమా షూటింగ్ జరుగుతున్న సందర్భంలోని ఈ సంఘటన జరిగింది. ఈ సినిమాలో ఒక సీన్ కోసం రామారావుని అంజలీదేవి చెంపదెబ్బ కొట్టవలసిన అవసరం వచ్చింది. రామారావుని  కొట్టడం అంజలీదేవికి ఇష్టం లేకపోయినా దర్శకుడు బి.ఏ.సుబ్బారావు ఆజ్జ మేరకు వణికే చేత్తో కొట్టడం వలన షాట్ ఓకే అయ్యాది కాదు. అయితే చివరికి 11వ సారి సీన్ ఓకే అయ్యింది. అయితే ఈసారి రామారావు చెవికి ఉండాల్సిన పోగు కనిపించలేదు. దీంతో ఎన్టీఆర్ చెవికి మరో పోగు తగిలించి 12వ సారి అంజలీదేవి చేత చెంపదెబ్బకొట్టించారు దర్శకుడు. అన్నివిధాల ఆ సీన్ అప్పటికి ఓకే అయ్యింది.

అన్ని సార్లు చెంపదెబ్బలు తిన్నా విసుక్కోకుండా సీన్ కు ఎన్టీఆర్ ఎంతో సహకరించేవారని, అందుకే అయన మహా నటుడు అయ్యాడని అంజలీదేవి అనేక సందర్భాల్లో చెప్పేవారు.

మరింత సమాచారం తెలుసుకోండి: