‘అల్లు అర్జున్ నాశనం చేశాడు’ ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న మాట ఇదే. శుక్రవారం నాడు విడుదలయ్యిన ‘ఇద్దరమ్మాయిలతో..’ సినిమా కలెక్షన్ల మాట ఎలా ఉన్నా.. ఈ చిత్రానికి టాక్ చాలా మాత్రం నెగటివ్ గా వినిపిస్తుంది. పాటలు, ఫైట్లు తప్ప సినిమాలో ఏమీ లేదని చెపుతున్నారు. సినిమాలో అల్లు అర్జున్ బాగా నటించాడని చెపుతున్నా.. ఈ సినిమా ను నాశనం చేసింది మాత్రం అల్లు అర్జునేనని చెపుతున్నారు. పూరీ రాసిన కథలో తలదూర్చి కథను నాశనం చేసిందని అల్లు అర్జున్ అని తాజా సమాచారం.

పూరీ రాసుకున్న ప్రకారం అయితే ఈ సినిమా వేరే విధంగా వచ్చి ఉండేదని, ఆ కథ ప్రకారం ఒక హీరోయిన్ (అమలాపాల్) చనిపోయి, మరో హీరోయిన్ (కేథరిన్) కు తాను మనసు ఇవ్వలేక హీరో (అల్లు అర్జున్) ఇద్దరికి దూరంగా జరుగుతాడని అంటున్నారు. అయితే ఇలాంటి విషాదమైన కథకు తాను నచ్చనని భావించిన అల్లు అర్జున్ ఇద్దరు హీరోయిన్ల సినిమాలా దీన్ని మార్చివేశాడని అంటున్నారు. పరాజయాల్లో ఉన్న పూరీని అల్లు అర్జున్ సులువుగా ఒప్పించగలిగాడని, అందుకే సినిమా ఇంత పూర్తిగా వచ్చిందని అంటున్నారు.

ఇద్దరమ్మాయిలతో.. సినిమాను నాశనం చేసిందని అల్లు అర్జునేని ఇప్పుడు అంతా భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: