అక్కినేని హీరోల మ‌నం ఎన్నో ప్ర‌త్యేక‌త‌ల‌తో ముస్తాబ‌వుతోంది. మూడు త‌రాల క‌థానాయ‌కులు ఇలా ఒకే సినిమాలో క‌నిపించ‌డం ఓ ప్ర‌త్యేక‌త‌. దానికి తోడుగా మ‌రో స‌ర్‌ప్రెజింగ్ ప్యాకేజ్ అందించ‌డానికి ఈ చిత్ర‌బృందం స‌మాయత్తం అవుతోంది. ఈ సినిమాలో నాగేశ్వ‌ర‌రావు స‌ర‌స‌న‌... రేఖ‌ని తీసుకొంటే ఎలా ఉంటుందా??  

అని చిత్ర బృందం సీరియ‌స్ గా ఆలోచిస్తోంద‌ట‌..  రేఖ‌ని గ‌నుక ఈ సినిమాతో టాలీవుడ్ తీసుకొస్తే - అంద‌రి దృష్టీ మ‌నం సినిమాపై నిల‌చిపోవ‌డం ఖాయం అని మ‌నం టీమ్ న‌మ్ముతోంది. దానికి రేఖ జీ స‌మాధానం ఏమిటో మ‌రి!  ఇది ఓ పున‌ర్జ‌న్మ‌ల నేప‌థ్యంలో సాగే క‌థ అని తెలుస్తోంది. ఇటీవ‌లే ఈ సినిమా కొబ్బ‌రికాయ కొట్టుకొంది. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: