ఒక‌నాటి క‌ల‌ల సుందరి ప్రముఖ బాలీవుడ్ నటి రేఖ ఇప్పుడు తెలుగులో న‌టిస్తోందా..? అవుననే అంటున్నాయి ఫిలింనగర్ వర్గాలు. రెండు రోజుల క్రితం అన్నపూర్ణ స్టూడియోలో లాంచనంగా ప్రారంభమైన అక్కినేని కుటుంబ చిత్రం ‘మనం’ సినిమాలో ఓ ముఖ్య పాత్ర కోసం రేఖ‌ను సంప్రదిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి.

అక్కినేని  మూడు తరాల క‌థానాయ‌కులు న‌టిస్తున్న చిత్రం మ‌నం. అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తోంది. విక్రమ్ కుమార్ ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నారు. శ్రియ‌, స‌మంత క‌థానాయిక‌లు. అక్కినేని నాగేశ్వర‌రావు జోడీగా రే్‌ఖ న‌టిస్తే  ఎలా ఉంటుంది? అనే దిశ‌గా చిత్రవ‌ర్గాలు ఆలోచిస్తున్నాయ‌ట‌. మ‌రోవైపు రేఖ‌నీ సంప్రదిస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్టులో రేఖ ఎంట్రీ ఇస్తే మ‌రింత క్రేజీగా ఉంటుంది.

రేఖ దక్షణాది చలనచిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు జెమినీ గనేషణ్ కుమార్తె అయిన ఆమెకు పేరు ప్రఖ్యాతలు వచ్చింది మాత్రం బాలీవుడ్ సినీరంగం లోనే నటిగానే కాకుండా ఆమె మంచి క్లాసికల్ డాన్సర్ అన్న చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. అక్కినేనికి సరిజోడిగా నటించగల సామర్ధ్యం రేఖకు ఉన్నది...

మరింత సమాచారం తెలుసుకోండి: