ఇప్ప‌టివ‌ర‌కూ తెలుగు ప్రేక్ష‌కులు ప్రియ‌మ‌ణిలోని ఒక కోణ‌మే చూశారు. అందంగా క‌నిపిస్తూ, గ్లామ‌ర్ కురిపిస్తే మురిసిపోయారు. తొలిసారి ఆమెలోని ఓ యాక్ష‌న్ హీరోయిన్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. త్వ‌ర‌లోనే చండీగా ద‌ర్శ‌న‌మివ్వ‌బోతోంది. స‌ముద్ర ద‌ర్శ‌కత్వం వ‌హించిన చిత్ర‌మిది.

కృష్ఱంరాజు కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా టీజ‌ర్ ఇటీవ‌లే విడుద‌లైంది. చండీగా ప్రియ‌మ‌ణి విజృంభించేసింద‌ని ద‌ర్శ‌కుడు చెబుతున్నారు. ప్రియ‌మ‌ణి కూడా ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకొంది. యాక్ష‌న్ స‌న్నివేశాల్లో డూప్ లేకుండా న‌టించింద‌ట‌. అవ‌న్నీ త‌న‌కు పేరు తీసుకొస్తాయ‌ని న‌మ్ముతోంది.

విజ‌య‌శాంతి కాలం తెలుగు తెర‌పై చెల్లిపోయినా ఇంకా క‌థానాయిక‌లు డిష్యూం డిష్యూం అన‌డం ఏమిటో..?  జ‌నం చూస్తార‌నే..!?

మరింత సమాచారం తెలుసుకోండి: