బాలీవుడ్ న‌టి జియాఖాన్ ఆత్మహ‌త్య ప్రతి ఒక్కరిని చ‌లించివేసింది. అంతే కాకుండా హీరోయిన్స్ అంద‌రికి వ‌ణుకును తెప్పించింది ఈ ఆత్మహ‌త్య. కొద్దిపాటి ఒత్తిళ్ళతో,దందాల మ‌ధ్య సాఫిగా వెళుతున్న బిటౌన్ ఇండ‌స్ట్రీకు జియాఖాన్ మ‌ర‌ణంతో, ఇంకెంత మంది ఈ వ‌రుస‌లో ఉన్నారో అని ఆలోచిస్తుంది.

వ‌ర్మ ప‌రిచ‌యం చేసిన హీరోయిన్, ఇలా మ‌ర‌ణించ‌టంపై రామ్‌గోపాల్‌వ‌ర్మ మ‌రింత దిగ్భాంతికి గుర‌య్యారు. నిజ‌జీవుత‌పు చావులు,ఘోరాలే క‌థాంశంగా ఎంచుకునే వ‌ర్మకు జియాఖాన్ మ‌ర‌ణం మ‌రింతగా క‌లిసి వ‌చ్చింది. ఓ ప్రక్క బాధ‌ప‌డుతూనే మ‌రో వైపు క‌థ‌ను రెడీ చేసే ప‌నిలో ఉన్నాడు.

జియాఖాన్ మ‌ర‌ణంపై పోలీసులు చివ‌రి నివేధిక‌ను స‌మ‌ర్పించాక, ఈ స్టోరికు సంబంధించిన టైటిల్ అనౌన్స్‌మెంట్ చేస్తాడ‌ని స‌న్నిహితులు చెబుతున్నారు. ఈ రియాలిస్టిక్ స్టోరిలో వ‌ర్మ కూడ ఓ రోల్ చేయ‌బోతున్నాడు. దీంతో జియాఖాన్ మ‌ర‌ణం కంటే వ‌ర్మ న‌టించ‌బోతున్న ఈ మూవీ బిటౌన్ టాక్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: