ప్రపంచం వద్దన్నా, నేను అనుకున్నదే దక్కాలంటూ ఇద్దరూ పెళ్ళిచేసుకున్నారు. పెళ్లి తరువాత మొగడుకి పిల్లలు కావాలంటే తను మాత్రం అవసరం లేదంటుంది. ఇదంతా జరిగింది కరీనాకపూర్,సైఫ్ ఆలీ ఖాన్ల మధ్య.
వెల్,షాహిద్కపూర్ తో ఎఫైర్కు బ్రేక్అప్ చెప్పి, సైఫ్ను పెళ్ళి చేసుకున్న కరీనా లైఫ్, లగ్జరీగా వెళుతుంది. 'పెళ్ళి తరువాత పిల్లలు కామన్ కదా,మరి మీరు ప్లానింగ్లో ఉన్నారా' అని ఓ మ్యాగ్జైన్కు ఇచ్చిన ఇంటర్యూలో అడిగితే, 'అలాంటిదేమి లేదు, మాకు పిల్లలు అవసరం లేదు. ఆల్రెడి సైఫ్కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రత్యేకంగా మాకు వద్దూ. నాకు తల్లికావాలని లేదు. ఇద్దరు ఒకరికి ఒకరు నచ్చి పెళ్ళిచేసుకున్నాం. ఇక్కడితో చాలు. ఇంకేం ప్లానింగ్స్ను పెట్టుకోలేదు.అంతే..' అంటూ సెలవిచ్చింది.
'అలా అయితే సైఫ్ ఒప్పుకున్నాడా...?' అని అడిగితే, 'ఫస్ట్ నో అన్నాడు, తరువాత ఓకె అన్నాడు. ఇప్పుడు నో ప్లాబ్లమ్. వియ్ ఆర్ హాపి..' అంటూ ఇంటర్వూ ఫినిష్ చేసింది. అయితే నచ్చిన వాడిని పెళ్ళి చేసుకున్న కరీనాకు మరి పిల్లలు ఎందుకు అవసరం లేదు, ఏజ్ దాటిందా..ఏజ్ సపోర్ట్ చేయటం లేదా.. అంటూ ఎప్పటిలాగే మీడియాలో టాక్స్ మొదలయ్యాయి.