హీరో గోపిచంద్, వెర్సటైల్ డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి కాంబినేషన్ లో వస్తోన్న చిత్రం సాహసం. వరుస ప్లాప్స్ తో అల్లాడిపోతున్న గోపిచంద్ ఈ సినిమాపై ఆశలు పెట్టుకున్నాడు. ఆ ఆశలు , అంచనాలకు తగ్గట్టే చంద్రశేఖర్ యేలేటి సినిమాను తెరకెక్కించాడట. ఈ మద్యే రిలీజైన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
దీంతో ఇపుడు సినిమాను తమదైన స్టైల్ ప్రమోషన్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకుంటున్నారట. అందులో భాగంగా ఈ రోజు ఎటువంటి ఫంక్షన్ లేకుండానే ఆడియోను డైరెక్ట్ మార్కెట్లోకి రిలీజ్ చేసేశారు. ఫంక్షన్ పెట్టకుండా ఆడియోను రిలీజ్ చేసి హిట్ కొట్టి హెక్సా ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్ చేయాలనుకుంటున్నారట. అంతేకాదు మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ కంపోజ్ చేసిన సాంగ్స్ సూపర్ గా వున్నాయని , ఆడియోతో పాటు మూవీ కూడా బాగా వచ్చిందని ...ఆ దైర్యంతోనే ఇలా చేస్తున్నామని మూవీ యూనిట్ అంటోంది.
ఇక రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్ సమర్పణలో బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ భారీ బడ్జెట్ రూపొందించిన ఈ ఎడ్వంచరస్ ఎంటర్ టైనర్ లో గోపిచంద్ కి జోడిగా తాప్సి నటించింది. ఇప్పటివరకు ఏ తెలుగు సినిమా చేయని రేర్ లోకేషన్స్ లో షూటింగ్ జరుపుకున్న సాహసం ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి సాహసం బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.