నంద‌మూరి హీరో క‌ళ్యాణ్ రామ్ సాహ‌సాన్ని అభిమానులు తెగ మెచ్చుకుంటున్నారు. మార్కెట్లో క‌ళ్యాణ్‌రామ్ స్టామానాకు మించి త‌న మూవీను నిర్మించుకోవ‌డ‌మే కాకుండా మూవీ బిజినెస్ అయినా కాక పోయినా మూవీను రిలీజ్ చేసుకోవ‌డానికి సిద్దమ‌య్యాడు. నంద‌మూరి హీరో ధైర్యం చూసి అభిమానులు సంతోష‌ప‌డుతున్నారు. క‌ళ్యాణ్‌రామ్ 3డి మూవీ ఓం కు 25 కోట్ల వ‌ర‌కు ఖ‌ర్చు అయ్యింది.

ఇప్పటి వ‌ర‌కూ నంద‌మూరి హీరోలు టెక్నాల‌జీ ప‌రంగా ఏ కొత్త ప్రయ‌త్నాలు చేయ‌లేదు. మొద‌టిగా క‌ళ్యాణ్‌రామ్ చేయ‌డం, అందులోనూ భారీ బ‌డ్జెట్ మూవీ కావ‌డంతో, నంద‌మూరి వంశంలో చెప్పుకోద‌గ్గ ప్రయోగాత్మక‌త  మూవీ కూడ‌ ఒక‌టుందంటున్నారు.

అయితే క‌ళ్యాణ్ రామ్ సాహ‌సం వెనుక ఎంతో క‌సి ఉంది. ఇప్పటి వ‌ర‌కూ మూస‌ధోర‌ణిలో వెళ్ళిన నంద‌మూరి సినిమాల‌ను కొత్త పుంత‌లు తొక్కించ‌డానికి ఈ మూవీ నిర్మాణం జ‌రిగింద‌ని స‌న్నిహితుల స‌మాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: