క్రేజీ డైరెక్టర్  పూరిజగాన్నాద్  మరో బాంబ్ పేల్చాడు తన లేటెస్ట్ సినిమాలోని ‘మాటలు లేవు మాట్లాడుకోవటాలు లేవు’ అన్నట్లు గా తనకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు బేదాభిప్రాయాలు నిజమే అని ప్రస్తుతం తమ మధ్య మాటలు లేవనీ ఒక ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియచేసారు. అంతేకాదు తాము మళ్ళీ కలిసి భవిషత్ లో పనిచేయలేమేమో అని కూడా చెప్పారు.

‘బద్రీ’ సినిమా ద్వారా పూరీని పరిచయం చేసిన పవన్ పదేళ్ళ గ్యాప్  తరువాత గత సంవత్సరం ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమా తీస్తున్నప్పుడే వీరిద్దరి మధ్య అభిప్రాయ బేధాలు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలకు పూరీ ఇచ్చిన ఇంటర్వ్యూ మరింత బలం చేకురినట్లు అయింది.

ప్రస్తుతం పూరి మహేష్, ప్రభాస్, బన్నీలతో సినిమాలు ఉన్నాయి అని చెపుతున్నా ప్రస్తుతానికి వారెవ్వరు మరో సంవత్సరం వరకూ కాళీ గా లేరట. కాబట్టీ ఈలోగా ‘బిజెనెస్ మేన్’, ‘ఈడియట్’, ‘అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి’ సినిమాలు బాలీవుడ్ రీమేక్ ల విషయం చూసుకోవాలిసిందే.....   

మరింత సమాచారం తెలుసుకోండి: