మ‌హేష్‌బాబు త్వ‌ర‌లోనే బాలీవుడ్ వెళ్తున్నాడు. అక్క‌డ ఓ సినిమా చేయ‌బోతున్నాడు... అంటూ మీడియా టాం టాం చేసేసింది. బాలీవుడ్‌లో సినిమా చేయ‌డానికి మ‌హేష్ ఉత్సాహం చూపిస్తున్నాడ‌ని, అక్క‌డి ద‌ర్శ‌కులు కూడా మ‌హేష్ డేట్ల కోసం ప‌డిగాపులు కాస్తున్నార‌ని... చెప్పుకొన్నారు. అందుకే...

షారుఖ్‌ఖాన్ చెన్నై ఎక్స్‌ప్రెస్ లో గెస్ట్ రోల్ చేయ‌మ‌న్నా, నో అన్నాడ‌ని - హీరోగా చేసే ముందు  ఈ చిన్న చిన్న వేషాలు వేయ‌డం మ‌హేష్‌కి ఇష్టం లేద‌ని ర‌క‌ర‌కాలుగా చెప్పుకొన్నారు. ఈ ఆశ‌లపై మ‌హేష్ ఒక్క‌సారిగా నీళ్లు చ‌ల్లాడు. త‌న‌కు అస‌లు బాలీవుడ్‌లో సినిమా చేసే ఆలోచ‌నే లేద‌ని మ‌రోసారి స్ప‌ష్టం చేశాడు.

తెలుగులో మంచి క‌థ‌లు వ‌స్తున్నప్పుడు బాలీవుడ్‌లో సినిమా చేయ‌డం ఎందుకు..? ఇక్కడ నాకు కావ‌ల్సిన స్థానం ద‌క్కింది.. అంటున్నాడు మ‌హేష్‌. కావ‌ల్సిన స్థానం అంటే... నెంబ‌ర్ వ‌న్ అనే క‌దా..??
 

మరింత సమాచారం తెలుసుకోండి: