హిట్లు లేక‌పోయినా ఏదోలా సినిమాలు ద‌క్కించుకోవ‌డంలో నేర్ప‌రి స‌ముద్ర‌. ఇప్పుడు ప్రియ‌మ‌ణిని చండీగా చూపిస్తున్నాడు. ఈ సినిమాని ఎలాగోలా పాపుల‌ర్ చేయాల‌ని స‌ముద్ర చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నాడు. అందులో భాగంగా ప్ర‌భాస్ అభిమానుల‌కు గాలం వేస్తున్నాడు. ఈసినిమాలో కృష్ణం రాజు ఓకీల‌క పాత్ర‌లో క‌నిపిస్తున్నారు.

ఆయ‌న చేత ''నేను రెబ‌ల్‌, నా వార‌సులు రెబ‌ల్‌, నా వంశ‌మే రెబ‌ల్‌..'' అనే డైలాగ్ ప‌లికించాడు స‌ముద్ర‌. ఇక్క‌డ వార‌సులు.. అంటే ప్రభాస్ అని వేరే చెప్పాలా..?  ఆ డైలాగ్ ఎంత కృత‌కంగా ఉందో, దాన్ని తీసిన విధానం కూడా అంతే కృత్రిమంగా ఉంది. ఇందంతా ప్ర‌భాస్ ఫ్యాన్స్ ని థియేట‌ర్ల‌కు తీసుకురావ‌డానికి స‌ముద్ర వేస్తున్న ఎత్తుగ‌డ‌. ఈ గాలానికి ప్ర‌భాస్ ఫ్యాన్స్ చిక్కుతారా..?  ఏమిటి? ఇలాంటివి వాళ్లు ఎన్ని చూళ్లేదూ...?
 

మరింత సమాచారం తెలుసుకోండి: