అక్కినేని హీరోల సినిమా మ‌నం కొబ్బ‌రికాయ కొట్టుకొంది. ఇద్ద‌రు హీరోయిన్లు ఫిక్స‌య్యారు. రేఖ కోసం ప్ర‌య‌త్నాలు ప్రారంభిస్తున్నారు. అంతా బాగానే ఉంది. కానీ ఒక్క‌టే డౌట్‌. ఇది అక్కినేని హీరోల సినిమా క‌దా..?  మ‌రి  సిసింద్రీ అఖిల్ ఎందుకు లేడు..?  అని. ఇదే డౌటు నాగార్జున‌కీ వ‌చ్చింద‌ట‌. చైతూ ఉన్న‌ప్పుడు అఖిల్ కూడా ఉంటే బాగుంటుంది క‌దా..?  

అని ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కుమార్ ద‌గ్గ‌ర సందేహం లేవ‌నెత్తాడ‌ట‌. దాంతో ఆయ‌న నెత్తిమీద పిడుగు ప‌డిన‌ట్టైంది. ఈ క‌థ ముగ్గురి గురించి రాసుకొంది. మ‌రి ఇందులో అఖిల్‌ని ఎలా ఇరికించాలా?  అని ఆలోచిస్తున్నారు. అఖిల్ కూడా జాయిన్ అయితే.. అక్కినేని ఫ్యాన్స్‌కి ఇక పండ‌గే.

మరింత సమాచారం తెలుసుకోండి: