బాక్సాఫీసు ద‌గ్గ‌ర చావో రేవో తేల్చుకోవ‌డానికి క‌ల్యాణ్‌రామ్ డిసైడ్ అయ్యాడు. త‌న యాక్ష‌న్ సినిమా ఓమ్‌ని అన్ని హంగుల‌తో ఈనెల 28న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చేందుకు స‌మాయాత్తం అవుతున్నాడు. ఈసినిమాకి గురువారం సెన్సార్ జ‌రిగింది.  U/A సర్టిఫికెట్ ల‌భించింది. రూ.25 కోట్ల బ‌డ్జెట్‌తో నిర్మించిన సినిమా ఇది.

దీనిపై ఈ నంద‌మూరి హీరో చాలా ఆశ‌లే పెట్టుకొన్నాడు. క‌త్తి సినిమా క‌ల్యాణ్‌రామ్‌ని చాలా నిరాశ ప‌రిచింది. రెండున్న‌ర యేళ్ల గ్యాప్ త‌ర‌వాత ఓం వ‌స్తోంది. ఈ సినిమాలో కృతిక‌ర్బంద‌, స‌నాఖాన్ క‌థానాయిక‌లు. ఇద్ద‌రూ ఐరెన్ లెగ్గులే కావ‌డం నంద‌మూరి ఫ్యాన్స్‌ని క‌ల‌వ‌ర‌పెడ‌తున్నా ఈసారి మాత్రం హిట్ కొట్ట‌డం ఖాయం అంటున్నాడు క‌ల్యాణ్‌రామ్.

తాను మాత్రం ఐరెన్ లెగ్గుల‌ను కాకుండా టెక్నాల‌జీనే న‌మ్ముతున్నాడు. చూద్దాం ఏది గెలుస్తుందో, సాంకేతిక ప‌రిజ్ఞాన‌మా?  తెలుగు సినిమా సెంటిమెంటా..?
 

మరింత సమాచారం తెలుసుకోండి: