స్పాట్ ఫిక్సింగ్ సెగ‌ బాలీవుడ్‌ని తాకింది. రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఆట‌గాళ్లకే కాదు, ఆ జ‌ట్టు య‌జ‌మానుల‌కూ ఫిక్సింగ్‌తో సంబంధాలున్నాయ‌న్న నిజం పోలీసులు బ‌య‌ట‌పెట్టేశారు. రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టు ఎవ‌రిదో కాదు.. శిల్పాశెట్టిదే. ఈ సాగ‌ర కన్య శ్రీ‌వారు.. రాజ్‌కుంద్రా కీ ఫిక్సింగ్‌తో సంబంధాలున్నాయ‌ట‌. అందుకే ఇప్పుడు కుంద్రాని పోలీసులు సీరియ‌స్‌గా విచారిస్తున్నారు.

ఆయ‌న్ని అరెస్టు చేయ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. దాంతో శిల్పా శెట్టి త‌ల్ల‌డిల్లిపోతోంది. అనవ‌స‌రంగా ఐపీఎల్ రొంపిలోకి దిగి ఇరుక్కుపోయామే.. అంటూ తెగ బాధ‌ప‌డిపోతోంద‌ట‌. అడుసు తొక్క‌నేల‌... కాళ్లు క‌డ‌గ‌నేల అని ఊర‌కే అన్నారా?
 

మరింత సమాచారం తెలుసుకోండి: