వంశీ సినిమా అంటే... టైటిల్ వైవిధ్యంగా ఉంటుంది. ఒక‌రితో ఒక‌రు మాట్లాడుకొన్న‌ట్టు ఉంటుంది. ఔను.. వాళ్లిద్ద‌రూ ఇష్ట‌ప‌డ్డారు, కొంచెం ట‌చ్‌లో ఉంటే చెబుతా... ఇలాగ‌న్న‌మాట‌. ఇప్పుడూ అలాంటి పేరే పెట్టారు త‌న సినిమాకి. అదే.. `త‌ను మొన్నే వెళ్లిపోయింది`. వంశీ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న 25వ సినిమా ఇది. అజ్మ‌ల్‌, నిఖితా నారాయ‌ణ్ జంట‌గా న‌టిస్తున్నారు.

ఈ సినిమాకి మొద‌ట ల‌వ్ అనే పేరు ప‌రిశీలించారు. అయితే.. చివ‌రికి అచ్చ తెలుగు పేరే పెట్టారు. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది. ఆద్యంతం వినోదాత్మ‌కంగా సాగే క‌థ‌. ఓ అమ్మాయి కోసం ఓ అబ్బాయి చేసే అన్వేష‌ణ ఇది. అబ్బాయి ఎక్క‌డికి వెళ్లినా.. త‌ను మొన్నే వెళ్లిపోయింది.. అనే స‌మాధానం వినిపిస్తుటుంద‌ట‌. అందుకే ఈ పేరు పెట్టార‌ట‌. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: