ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమా అత్తారింటికి దారేది ( ఈ టైటిల్ ఇంకా ఫిక్స్ కాలేదు) సినిమా కోసం మ‌హేష్‌బాబు వాయిస్ ఓవ‌ర్ ఇచ్చాడ‌ని చెప్పుకొన్నారు. త్రివిక్ర‌మ్‌తో మ‌హేష్‌కి ఉన్న స్నేహం వ‌ల్లే.. ప్రిన్స్ ఈసినిమాకి గొంతు అరువిచ్చాడ‌న్నారు. అయితే ఈ సినిమాకి వాయిస్ ఓవ‌ర్ ఇచ్చింది మ‌హేష్ కాదు..

. ప్ర‌భాస్‌. ఈ సినిమాలో కొన్ని పాత్ర‌ల్ని ప్ర‌భాస్ ప‌రిచ‌యం చేస్తారు. అత్తారింటికి దారేది సినిమాలో ఓ గెస్ట్ రోల్ కోసం మ‌హేష్‌ని అడిగిన మాట నిజ‌మేన‌ట‌. మ‌హేష్ కాద‌న‌డంతో - గెస్ట్ రోల్ అవ‌స‌రం లేకుండా పోయింది. మ‌రో క‌థానాయ‌కుడితో వాయిస్ ఓవ‌ర్ ఇప్పిస్తే స‌రిపోతుంది అనుకొన్నార‌ట‌. అప్పుడు త్రివిక్ర‌మ్‌కి త‌ట్టిన పేరు..

ప్ర‌భాస్‌. ఇలా క‌థానాయ‌కులు ఒక‌రి సినిమాల‌కు ఒక‌రు గొంతు స‌హాయం చేసుకోవ‌డం... టాలీవుడ్‌లో మంచి సంప్రదాయానికి తెర లేపుతుంది అన‌డంలో సందేహం లేదు. ఈ క్రెడిట్ అంతా.. మ‌హేష్‌, ప్ర‌భాస్‌ల‌దే.
 

మరింత సమాచారం తెలుసుకోండి: