టాలీవుడ్ లో కుటుంబ వారసత్వం గురించి చెప్పుకోవాలి అంటే ప్రప్రధమస్థానంలో ఉండేది మెగా కుటుంబం. ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ  మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ ఎంట్రీ గురించి గత కొంత కాలంగా ఇండస్ట్రీలో పెద్ద రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ముందుగా 'సీతమ్మ వాకిట్లో ' సినిమా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలతో సినిమా చేస్తున్నాడని, దానికి 'గొల్ల భామ' అని టైటిల్ ని కూడా సెట్ చేయడం, శ్రీకాంత్ కూడా దానికి అంగీకరించడం జరిగిందని వార్తలు కూడా వచ్చాయి.

అయితే కొద్ది రోజులుగా రామ్ చరణ్ ను పరిచయం చేసిన పూరి జగ్గన్నాద్ అయితేనే బాగుంటుందని నాగబాబు అనుకుంటున్నారని, వరుణ్ తేజ్ పూరి సినిమాతో ఎంట్రీ ఉంటుందని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు పూరితో చేసేది తెలుగు సినిమా కాదని, బాలీవుడ్ ఫిల్మ్ అని, అది కూడా పూరి, రవితేజల బ్రేకింగ్ హిట్ 'ఇడియట్' అని చెబుతున్నారు.ఇప్పటికే ఈ హిందీ సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని సమాచారం. అయితే తెలుగుసినిమా మాత్రం ఎప్పుడు ఉంటుంది అనేది మాత్రం సమాచారం ఇవ్వడంలేదు.

 వరుణ్ తెలుగు ఎంట్రీ కన్నా బాలీవుడ్ ఎంట్రీకే మెగా ఫ్యామిలీ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది కారణం, ఇప్పటికే తెలుగులో చాలా మంది  మెగా హీరోలు ఉన్న తరుణంలో  వరుణ్ లో ఉన్న నార్త్ లుక్ ను వీరు క్యాచ్ చేసుకొనేలా చూస్తున్నారట. ఇప్పటికే బాలీవుడ్ పై కన్నేసిన రామ్ చరణ్ తన తమ్ముడు వరుణ్ తో కలిసి బాలీవుడ్ ను ఏలుతారు కాబోలు. కానీ టాలీవుడ్ కన్నా విపరీతమైన పోటీ ఉన్న బాలీవుడ్ లో ఈ యువ మెగా బ్రదర్స్ నిలబడతార అన్నదే ?

 

మరింత సమాచారం తెలుసుకోండి: