పూరి-ప‌వ‌న్ మ‌ధ్య ఇప్పుడు మాట‌ల్లేవ్‌. ఈ మాట పూరినే ఒప్పుకొన్నాడు. అయితే దీనికి కార‌ణం మాత్రం పూరి చేసిన ఓవ‌ర్ యాక్ష‌నే అని తేలింది. కెమెరామెన్ గంగ‌తో రాంబాబు సినిమా స‌మ‌యంలోనే ఇద్ద‌రి మ‌ధ్య విబేధాలు భ‌గ్గుమ‌న్నాయ‌ట‌. పూరి చెప్పింది ఒక‌టి..

తీస్తోంది మ‌రోటి కావ‌డంతో అప్పుడే పూరికి ప‌వ‌న్ వార్నింగ్ ఇచ్చాడ‌ట‌. దాంతో - మ‌ళ్లీ ప‌వ‌న్‌తో సినిమా చేయ‌డానికి జంకుతున్నాడు పూరి. అయితే పూరి ఇచ్చిన రాంగ్ స్టేట్‌మెంట్‌తో ప‌వ‌న్ అభిమానులు పూరికి బాగా యాంటీ అయిపోయారు. పూరి రాబోయే సినిమాల‌పై దీని ప్ర‌భావం ప‌డే అవ‌కాశాలున్నాయి.

అన‌వ‌స‌రంగా నోరు జారానే.. అని పూరి ఇప్పుడు ఫీల‌వుతున్నాడ‌ట‌. రేపో మాపో ప్రెస్‌మీట్ పెట్టి సారీ చెప్పినా చెప్పొచ్చు అంటున్నారు. చూద్దాం.. ఏం జ‌రుగుతుందో.?

మరింత సమాచారం తెలుసుకోండి: