చికెన్ ప్రియులు వెంకటేశ్వర హేచరీస్ పేరు వినని వారు ఉండరు. ఇప్పుడు ఆ సంస్థ అధిపతి బాలాజీ రావు మనస్సు టాలీవుడ్ సినిమా పై పడింది. బాలా ఎంటర్ టైన్మెంట్స్ అనే సంస్థ ను స్థాపించిన ఈయన ప్రస్తుతం టాలీవుడ్ లో బాలీవుడ్ లో సినిమాలు తీసే ఆలోచనలో ఉన్నారట. ప్రముఖ వ్యాపార సంస్థలు అన్నీ కూడా ఈ సినిమా రంగం పై మనసు పారేసుకుంటున్న విషయం తెలిసిందే. రెలియన్స్ సినిమా, పివిఆర్ సినిమా సంస్థలు కార్పొరేటు లెవెల్ లో సినిమాలు తీసేస్తున్నాయి.

అదే కోవలో ప్రయత్నిస్తామని బాలాజీ రావు కూడా టాలీవుడ్ పై కన్నేసారు. ఇక్కడ తనకు సన్నిహితంగా ఉండే నిర్మాత గురించి వెతుకుతూ ఉంటే అక్కడ కూడా నిర్మాత బండ్ల గణేష్ కి అదృష్టం వరించింది. బాలాజీ రావు బండ్ల గణేష్ కలిసి ఒక నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి టాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన సినిమాలను బాలీవుడ్ లో, బాలీవుడ్ సూపర్ హిట్ అయిన సినిమాలను టాలీవుడ్ లో నిర్మించే ఉద్దేశంలో ఉన్నారట.

బాలీవుడ్ లో సూపర్ హీరోలుగా పేరుగాంచిన అజయ్ దేవగన్, సల్మాన్ ఖాన్ లాంటి సెలబ్రేటీలు బాలాజీ రావుకు స్నేహితులు కావడంతో, ఈ మధ్యనే విడుదలై సూపర్ హిట్ కొట్టిన ‘బాదుషా’ సినిమాను హిందీలో రీమేక్ చేసే ఉద్దేశంతో బండ్ల గణేష్ ను పూనా లోని తన ఆఫీసుకు రప్పించుకుని ఈ విషయం పై చర్చలు జరిపాడని తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఒక ప్రముఖ పత్రిక బండ్ల గణేష్ ప్రస్తావిస్తే తన సహజ సిద్దమైన వినయపూర్వక నవ్వుతో వివరాలు త్వరలో చెపుతాను అని చెప్పి వెళ్ళి పోయాడట...!!

మరింత సమాచారం తెలుసుకోండి: