యాక్ష‌న్ త్రీడీ సినిమా అన్నిహంగులూ పూర్తిచేసుకొని విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. అనిల్ సుంక‌ర ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సినిమా ఇది. న‌రేష్‌, వైభ‌వ్‌, రాజు సుంద‌రం, కిక్ శ్యామ్ న‌టించారు. ఈ సినిమా పూర్త‌యిన సంద‌ర్భంగా  గుమ్మ‌డికాయ కొట్టేశారు. ఈనెల 14న ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్నారు

. ఐరెన్‌మ్యాన్‌, లైఫ్ ఆఫ్ పై సినిమాల కంటే... ఇందులో బెస్ట్ అవుట్ పుట్ ఉంటుంద‌ని న‌రేష్ చెబుతున్నారు. ఈ యాక్ష‌న్ త్రీడీకి హాలీవుడ్ నిపుణుడు కీత్ ప‌నిచేశారు. ఆయ‌న‌తో పాటు దాదాపు 20 మంది టెక్నీషియ‌న్లు త్రీడీ ఎఫెక్టుల కోసం శ్ర‌మించార‌ట‌. ప్రేమ‌యుద్ధం సినిమాలోని స్వాతి ముత్య‌పు జ‌ల్లుల‌లో పాట‌ని ఈ సినిమా కోసం రీమిక్స్ చేశారు. వీటి ఫ‌లితం ఎలా ఉంటుందో తెలియాలంటే ... 14 వ‌ర‌కూ ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: