శ్రుతిహాస‌న్ ఫుల్ ఫామ్‌లో ఉంది. చేతినిండా సినిమాలే సినిమాలు. నిన్న‌టి వ‌ర‌కూ బ‌లుపు సినిమా కోసం ర‌వితేజ‌తో ఆడింది, పాడింది. ఇప్పుడు ఆసినిమా పూర్త‌వ‌డంతో వెంట‌నే ఎన్టీఆర్ సినిమాలోకి జంప్ చేసింది. ఎన్టీఆర్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న చిత్రం..

రామ‌య్యా వ‌స్తావ‌య్యా. హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. దిల్‌రాజు నిర్మాత‌. ఈ సినిమాలో స‌మంత క‌థానాయిక. మ‌రో కీ రోల్‌లో శ్రుతిహాస‌న్ క‌నిపించ‌నుంది. బ‌లుపు షూటింగ్ అయిపోయిన త‌ర‌వాతే.. రామ‌య్యా వ‌స్తావ‌య్యా సినిమాకి కాల్షీట్లు ఇచ్చింది శ్రుతి. అందుకే ఇప్పుడు..

ఎన్టీఆర్‌తో ప‌క్క‌కు వెళ్లిపోయింది. ప్ర‌స్తుతం ఎన్టీఆర్‌, శ్రుతిహాస‌న్ మ‌ధ్య స‌న్నివేశాల‌ను తెర‌కెక్కిస్తున్నారు. ఇటీవ‌లే మ‌లేసియాలో ఓ పాట‌ని చిత్రీక‌రించుకొచ్చారు. త‌మ‌న్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: