పవన్ కళ్యాణ్ ప్రస్తావన లేకుండా ప్రస్తుతం టాలీవుడ్ లో సినిమాలు ఉండటం లేదు. పవన్ సినిమాలలోని పాటలను టైటిల్స్ గా పెట్టుకుని కొందరు హీరోలు వస్తూ ఉంటే అదే కుటుంబానికి చెందిన బన్నీ తన ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమాలో పవన్ పై సెటైర్స్ పెట్టి తన సినిమా ఇమేజ్ ని పెంచుకోవడానికి ప్రయత్నించాడు. తాజాగా తన బాబాయి ఇమేజ్ ని అబ్బాయి రామ్ చరణ్ తన ‘ఎవడు’ సినిమా కోసం వాడుకుంటున్నారు అని అంటున్నారు. ‘ఎవడు’ చిత్రంలో పవన్ కళ్యాణ్ పేరును ఉపయోగించి చేర్రీ చెప్పే డైలాగ్ ఇప్పుడు టాక్ అఫ్ ది ఇండస్ట్రీగా మారింది.

ఈ సినిమాలో ఒక సన్నివేశంలో శ్రుతిహాసన్ చెర్రీని ఉద్దేసించి ‘నువ్వు పవన్ కళ్యాణ్ లా ఫైట్ చేస్తే నేను నిన్ను ప్రేమిస్తాను’ అని చెపుతుందట. దానికి సమాధానంగా చెర్రీ ‘అయితే నన్ను మర్చిపో అమ్మతోడు  ఆయన లా ఫైట్ చేసే సీన్ ఎవ్వడికీ లేదు’ అంటాడట. ధీయేటర్లలో పవన్ ప్రస్తావన వస్తే చాలు చప్పట్లు ఈలలతో అదిరిపోతాయి. ఈ విషయం తెలిసిన డైరెక్టర్లు తెలివిగా పవన్ పేరును ఇలా వాడుతూ తమ సినిమా ఇమేజ్ ను పెంచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇదే ప్రయత్నం ఈ సినిమా దర్శకుడు వంశీ పైడి పల్లి ‘ఎవడు’ సినిమాలో చేస్తున్నట్లుగ తెలుస్తోంది.  ఇక ఈ చిత్ర కధ విషయానికి వస్తే న్యాయానికి, అన్యాయానికి జరిగే యుద్దంలో హీరోకు ఒకడు సహకరిస్తాడు.

 ఆ ఒకడు ‘ఎవడు’ అన్నది సస్పెన్స్. అల్లుఅర్జున్ ప్రత్యేక పాత్ర చేస్తున్న ఈ సినిమాలో బన్నీ పాత్ర ఈ సినిమాకు టర్నింగ్ పాయింట్ అని చెపుతున్నారు. శ్రుతిహాసన్ అమీజక్సన్ లు హీరోఇన్లు గా నటిస్తున్న ఈ సినిమా లో ఇలా ఎన్నో సంచలనాలు ఉన్నాయి అంటున్నారు. వివరాలు కోసం మెగా అభిమానులు మరికొద్దిరోజులు ఎదురు చూడాలిసిందే.....

 

మరింత సమాచారం తెలుసుకోండి: