క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్  దేవిశ్రీ ప్రసాద్ తన కెరీర్లో తొలిసారిగా బాలయ్య సినిమాకు పని చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ‘సింహ' తర్వాత బాలయ్య-బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందుతున్న మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టెనర్‌కి దేవిశ్రీ ప్రసాద్ మాస్ బీట్లు జోడైతే ఇక నందమూరి అభిమానులకు పండుగే.  

ఈ మధ్యనే ఈ సినిమా ప్రారంభపు సన్నివేశాన్ని  దేవుడి చిత్రపాలపై చిత్రీకరించిన ముమూర్తపు షాట్‌కు బాలకృష్ణ క్లాప్ కొట్టారు. దర్శకుడు బోయపాటి ముహూర్తపు సన్నివేశానికి దర్శకత్వం వహించారు. సినిమా గురించి దర్శకుడు ఇటీవల మాట్లాడుతూ.... సింహా తరవాత నందమూరి బాలకృష్ణతో సినిమా చేయబోతున్నానని అందువల్ల అబిమానుల  అంచనాలు ఏ విధంగా ఉంటాయో తెలుసని చెప్పారు. 'సింహా'ని మించే సినిమా తీస్తా... అని చెబితే అది తొందరపాటు అవుతుంది. కానీ ఆ స్థాయికి మాత్రం తగ్గదు అంటున్నారు బోయపాటి. ఈ చిత్రానికి హీరోయిన్ ఇంకా హీరోయిన్ ఖరారు కాలేదు.

ఈ మధ్యనే ఈ సినిమాకు బాలీవుడ్ నటి విద్యాబాలన్ పేరు వెలుగులోకి వచ్చింది. ఈ సినిమా టైటిల్ పై కూడా రకరకాల పేర్లు బయటకు వస్తున్నాయి. ప్రస్తుతం మాత్రం ‘జయసింహ’ అని అంటున్నారు. బాలయ్య పుట్టినరోజు వేడుకలు ఈసారి కృష్ణాజిల్లాలో తన అభిమానుల మధ్య అత్యంత ఘనంగా జరుపుకోబోతున్నాడు. ఈ వేడుకలు అయిన తరువాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది అని అంటున్నారు....

 

మరింత సమాచారం తెలుసుకోండి: