పవన్ కళ్యాణ్ వార్తలు లేకుండా టాలీవుడ్ లో రోజు గడవడం లేదు. చివరకు పెద్ద హీరోల సినిమాలలో కూడా ఏదో ఒక సందర్భంలో ఈ పవర్ స్టార్ నామస్మరణ జరుగుతోంది. తాజాగా పవన్ తో గతంలో “పంజా” సినిమా తీసిన నీలిమా తిరుమల శెట్టి ఈ సినిమాకు సీక్వెల్ తిస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే “పంజా-2” పేరుతొ ఫిల్మ్ చాంబర్ లో టైటిల్ రిజిస్ట్రేషన్ కుడా జరగడంతో ఈ వార్తలకు మరింత బలాన్ని సమకుర్చాయి.

 ప్రస్తుతం నీలిమ అంతా కొత్త వారితో ఓ సినిమా తీస్తోంది. ఈ సినిమా తరువాత వరసగా మూడు సినిమాలు తీసే ఆలోచన నీలిమ కు ఉందట. అయితే పంజా చిత్రం నీలిమా ఒక్కరే కాకుండా మరో ఇద్దరు నిర్మాతలతో కలిపి నిర్మించారు. ఈ సినిమా పరాజయం చెందడంతో మిగతా ఇద్దరు నిర్మాతలు నీలిమ నిర్మాణ సంస్థ నుండి బయటకు వచ్చేశారు. ఇటువంటి పరిస్థితులలో పరాజయం పొందిన సినిమాకు సీక్వెల్ అన్నది అసంభవం అని, కేవలం పబ్లిసిటీ కోసమే ఈ హడావుడి చేస్తున్నారని అంటున్నారు.

ప్రవాసఆంధ్రురాలైన నీలిమా తిరుమల శెట్టి పవన్ కి వీరాభిమాని. ఎంత వీరాభిమాని అయినా పరాజయం చెందిన సినిమాకు సీక్వెల్ తీసి తన గొయ్యి తాను తవ్వుకోరు. ఇది కేవలం తాను నిర్మిస్తున్న కొత్త సినిమాకు పబ్లిసిటీ స్టంట్ గా మాత్రమే ఈ సీక్వెల్ న్యూస్ ను టాలీవుడ్ లో చలామణి చేస్తున్నారని అంటున్నారు. వాస్తవాలు ఏమిటి..? అన్నది రానున్న రోజులలో తెలుస్తాయి.
 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: