32  సంవత్సరాలు వచ్చినా హీరోయిన్ కరీనా కపూర్ ఇప్పటికీ గ్లామరస్ గానే కనిపిస్తోంది. సైఫ్ ఆలీఖాన్ తో పెళ్ళి అయిపోయాక కూడా వరసపెట్టి సినిమాలు చేస్తూనే ఉంది. అంతేకాదు బాలీవుడ్ సినిమాలలో ఐటమ్ సాంగ్స్ చేస్తూ కోట్లాది రూపాయలు పారితోషికంగా చుట్టేస్తోంది ఈ గ్లామర్ బ్యూటీ. గత సంవత్సరం అత్యంత ఘనంగా పటౌడి నవాబ్ వంశ వారసుడు అయిన సైఫ్ ను పెళ్ళాడిన కరీనా,ప్రస్తుతం "సత్య గ్రహ", గోరి తేరే ప్యార్ మేన్" సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నా మీడియా తో మాట్లాడడానికి మాత్రం బయపడుతూ ఉంది.

 దీనికి ప్రధాన కారణం మీడియా వ్యక్తులు కరీనా ఎదురుపడితే క్రితం సంవత్సరం వరకూ పెళ్ళి ఎప్పుడు అంటూ వేధించే వారట. ఇక ఆ పెళ్ళి అయిపొయింది కాబట్టి మీడియా గోల తప్పిపోయింది అని కరీనా భావిస్తే, ప్రస్తుతం పిల్లలు ఎప్పుడు అంటూ ప్రశ్నలు వేస్తున్నారట. దీనితో చిర్రెత్తి పోతున్న కరీనా మీడియా వాళ్ళు కనబడితే ఈ ప్రశ్నలు తప్ప మీకు ఇంక ఏ విషయాలు ఉండవా..? అంటూ ఎదురు దాడి చేస్తోందట. అంతేకాదు తనకు ఏ మంత వయసు అయిపోయి౦దని పిల్లలు అంటూ వేధిస్తున్నారు..? ఇప్పటికీ ఇంకా నావయసు 32 ఏళ్ళు యేగా అంటూ, అయినా తనకు పిల్లలు లేరని ఎందుకు అనుకుంటున్నారు.

సైఫ్ పిల్లలు తన పిల్లలు యేగా అంటూ కొంటె సమాధానాలు ఇస్తూ మీడియా ముందు తన తెలివితేటలు ప్రదర్శిస్తోంది కరీనా. సైఫ్ ఆలీఖాన్ పిల్లలు తన పిల్లలుగా స్వికరిస్తున్న కరీనా విశాల హృదయాన్ని మెచ్చుకోకుండా ఉండలేం.

మరింత సమాచారం తెలుసుకోండి: