మాజీ హీరోయిన్ శ్రీప్రియ, ఈపేరు ఈ తరానికి పెద్దగా పరిచయం ఉండదు. కాని కోలీవుడ్ లో మాత్రం ఈమె మన జయప్రద, జయసుధ లా ఒకప్పుడు ఒక వెలుగు వెలిగింది. ఒకనాటి కోలీవుడ్ సూపర్ స్టార్స్ ఎమ్జీఆర్, శివాజీ గణేషన్, రజినీకాంత్, కమల్ హాసన్ లతో దాదాపు 300 సినిమాలకు పైగా చేసింది.

ప్రస్తుతం ఆమె దృష్టి నిత్యామీనన్ పై పడిందట. ఇంతకీ శ్రీప్రియ నిత్య తో నటిస్తోంది అనుకుంటున్నారా..? అదేమీ కాదు. నిత్యను హీరోయిన్ గా పెట్టి ఆమె మెగా ఫోన్ పట్టుకొని దర్శకత్వం చేస్తోందట. మలయాళంలో సూపర్ హిట్ అయిన “220 కొట్టాయమ్” అనే సినిమాను తెలుగు, తమిళ భాషలలో నిర్మించాలని ప్రయత్నిస్తోంది. ఇప్పటివరకూ ఆమె దర్శకత్వం వహించకపోవడానికి గల కారణం శ్రీప్రియ కు నిత్యామీనన్ లాంటి మంచి నటి కనిపించలేదట. ప్రస్తుతం నిత్య దొరికింది కాబట్టి దర్శకత్వం చేస్తున్నాను అంటోంది శ్రీప్రియ.

ఈ విషయంలో మరొక ఫినిషింగ్ టచ్ ఏమిటంటే.. ఈ సినిమాకి ఎవరైనా టైటిల్ చెపితే లక్ష రూపాయలు బహుమతి గా ఇస్తానని శ్రీప్రియ ప్రకటించింది. ఇంక ఆలస్యం చేయకుండా సినిమా అభిమానులు అందరూ శ్రీప్రియ కు సినిమా టైటిల్ చెప్పి లక్ష రూపాయలు తెచ్చుకుంటే బాగుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: