ఎన్టీఆర్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న చిత్రం రామ‌య్యా వ‌స్తావ‌య్యా. స‌మంత క‌థానాయిక‌. హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌కుడు. ఈ సినిమాలో శ్రుతిహాస‌న్ కూడా ఉంద‌ట‌. అయితే.. హీరోయిన్ కాద‌ట‌. ఓ ముఖ్య‌మైన పాత్ర అని తెలిసింది. అంటే.. ఎన్టీఆర్‌తో పాట‌లూ, స్టెప్పులూ, రొమాన్సూ ఉండ‌దా?  అని అభిమానులు గభ‌రా ప‌డిపోతున్నారు. ఈ విష‌యంపై శ్రుతిహాస‌న్ ఓ క్లారిటీ ఇచ్చింది. `ఎన్టీఆర్‌తో న‌టిస్తున్నా. అందులో నేను సెకండ్ హీరోయిన్ అని అంద‌రూ అంటున్నారు. కానీ.. కాదు. ఓ కీల‌క‌మైన పాత్ర‌. హ‌రీష్ శంక‌ర్ తో ఉన్న స్నేహం వ‌ల్లే.. ఈ  సినిమాలో న‌టించ‌డానికి ఒప్పుకొన్నా..`` అంటోంది. అంటే ఈ సినిమా చేస్తోంది ఎన్టీఆర్ కోసం కాదా..? 

మరింత సమాచారం తెలుసుకోండి: