ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోలు మధ్య ఇచ్చిపుచ్చుకునే ధోరణి బాగా ఎక్కువైంది. పెద్ద హీరోలయితే వారి సినిమాలు ఓపినింగ్ కలెక్షన్స్ పడిపోకుండా వాళ్ళ సినిమాసినిమాకు రెండు వారాల గ్యాప్ ఉండేలా చూసుకుంటున్నారు. అంతేకాదు ఎవరైనా ఒక దర్శకుడు ఒక కధ ను తమకు వినిపిస్తే ఆ కధ నచ్చితే సరే, నచ్చకపోతే మటుకు ఆ కధకు ఎవరు సూటవుతరో సలహాలు కూడా ఇస్తున్నారట.

 గతంలో పూరీజగన్నాద్ ‘కెమెరా మేన్ గంగతో రాంబాబు’ సినిమా కధను హీరో రవితేజాకు వినిపిస్తే ఆ పాత్రకు తన కంటే హీరో పవన్ కళ్యాణ్ సరిపోతాడని సలహా ఇచ్చాడట. అదే విధంగా ‘బిజినెస్ మేన్’ సినిమా చిత్రీకరణ సమయంలో దర్శకుడు పూరి మహేష్ కు ‘ఇద్దరమ్మాయిలతో’ కధను వినిపిస్తే ఆ కధకు తన కంటే అల్లుఅర్జున్ సరిగ్గా సరిపోతాడని సూచించాడట.

ఈ విధంగా ప్రస్తుతం మన టాలీవుడ్ హీరోలు ఒకరికోసం ఒకరు సలహాలు ఇచ్చుకుంటూ తమ ఐక్యతను చాటుకుంటున్నారు. రాజకీయనాయకులలో లేని ఐక్యత మన టాలీవుడ్ హీరోలలో ఉండటం ఆనందించ తగ్గ విషయమే కధా.....
 

మరింత సమాచారం తెలుసుకోండి: