టీజ‌ర్ల‌లో మ‌హేష్ వ‌న్‌.. సంచ‌ల‌నాలు కొన‌సాగుతున్నాయి. తొలి మూడు రోజుల్లోనే ఏకంగా 5 ల‌క్ష‌ల క్లిక్స్ వ‌చ్చాయి ఈ టీజ‌ర్‌కి. ఇప్పుడు ప‌ది ల‌క్ష‌ల‌కు చేరువైంది. సౌత్ ఇండియాలోనే ఓ రికార్డ్ ఇది. కేవ‌లం 30 సెక‌న్ల టీజ‌ర్ కి ఇంతలా రెస్పాన్స్ రావ‌డం.. చిత్ర‌బృందంలో కొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది. మ‌హేష్‌బాబు స్టామినాకు ఇదో నిద‌ర్శ‌నం. టీజ‌ర్ మాత్ర‌మే కాదు..;

టైటిల్ కూడా జ‌నాల్లోకి వెళ్లిపోయింద‌ని సుకుమార్ అండ్ కో... న‌మ్ముతోంది. వ‌న్ టైటిల్ క‌రెక్టా?  క‌దా?  అనే అనుమానం ఈ మిలియ‌న్ క్లిక్స్‌తో ప‌టాపంచ‌లైపోయాయి. ఈనెల 18న చిత్ర‌బృందం యూర‌ప్ వెళ్తోంది. అక్క‌డ 60 రోజుల పాటు భారీ షెడ్యూల్ జ‌రుపుకోనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: