మనోజ్- నాగేశ్వరరెడ్డి కలయికలో ఓ చిత్రం సెట్స్పైకి వెళ్లింది. ఈనెల 9న ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. ఎల్లో ప్లవర్స్ పతాకంపై రమేష్ పుప్పాల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.దేనికైనా రెడీ తీసిన వెంటనే ఈ కాంబినేషన్ సెట్స్పైకి వెళ్లాల్సింది. కానీ... మనోజ్ పోటుగాడు సినిమా పనిలో పడడంతో... ఇది కాస్త ఆలస్యం అయ్యింది. పోటుగాడు పూర్తి కావొస్తుంది. అందుకే ఈ కొత్త సినిమాని పట్టాలెక్కించారు. ఇది కూడా యాక్షన్ ఎంటర్టైనర్ సినిమానే. నాగేశ్వరరెడ్డి కామెడీని బాగా డీల్ చేస్తాడు.
ఈ సినిమాతోనూ అదే మ్యాజిక్ చేయాలని చూస్తున్నాడు.ఈ సినిమా కోసం ప్రస్తుతం కథానాయిక ఎంపిక జరుగుతోంది. త్వరలోనే ఆమె పేరు ప్రకటిస్తారు. రమేష్ పుప్పాల ప్రస్తుతం పైసా సినిమాని రూపొందిస్తున్నారు. ఆ సినిమా ఆర్థిక సమస్యల్లో ఉందని టాలీవుడ్ టాక్. ఆ సినిమాని బయటకు తీసుకురాకుండానే ఈ సినిమా ఎలా మొదలెట్టాడో.. పరిశ్రమ పెద్దలకు అర్థం కావడం లేదు.