ఒక‌ప్పుడు త్రిష‌... టాప్ క‌థానాయిక‌. అగ్ర హీరోలంతా ఆమెతో క‌లిసి న‌టించ‌డానికి ఉత్సాహం చూపించేవారు. తెలుగు, త‌మిళం రెండు చోట్లా బిజీనే. త్రిష అంత అడిగితే అంత‌.. పారితోషికం ఇవ్వ‌డానికి నిర్మాత‌లు సైతం సిద్ధంగా ఉండేవారు. కానీ.. ప‌రిస్థితి ఇప్పుడు త‌ల్ల‌కిందులైంది. కొంత‌కాలం చేతిలో ఒక్క సినిమా కూడా లేకుండా గ‌డిపింది. యువ క‌థానాయికల‌తో పోటీ ప‌డ‌లేక‌...చ‌తికిల ప‌డింది.

ఇక త్రిష ప‌ని అయిపోయింది అనుకొన్నారు. త్రిష కూడా పెళ్లిచేసుకొని సెటిలైపోదామ‌నుకొంది. అయితే త్రిష ప‌రుగు మ‌ళ్లీ మొద‌లైంది. తెలుగు, త‌మిళ భాష‌ల్లో అవ‌కాశాలు అందుకొంటోంది. ర‌మ్‌.. సెట్స్‌పై ఉంది. అది కాక‌.. మరో లేడీ ఓరియెంటెడ్ సినిమాలో న‌టిస్తోంది. ఇప్పుడు సూర్య‌తో న‌టించే అవ‌కాశం ద‌క్కించుకొంది. సూర్య‌-గౌత‌మ్ మీన‌న్ క‌ల‌యిక‌లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది.

గౌత‌మ్ మీనన్ ద‌ర్శ‌కుడు. ఈ చిత్రానికి ధ్రువ న‌క్ష‌త్రం అనే పేరు క‌న్‌ఫామ్ చేశారు. ఈ సినిమాలో క‌థానాయిక‌గా త్రిష‌ని ఎంపిక చేశారు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు.ఇలాంటి మ‌రో అవ‌కాశం చేజిక్కించుకొంటే మాత్రం... త్రిష హ‌వా మ‌ళ్లీ మొద‌ల‌వ్వ‌డం ఖాయం. ర‌మ్ విజ‌యం సాధిస్తే.... మరిన్ని లేడీ ఓరియెంటెడ్ క‌థ‌లు త్రిష కోసం పుట్టే అవ‌కాశాలున్నాయ్‌. కొత్త‌మ్మాయిల‌కు ఇక క‌ష్ట‌కాల‌మే.

మరింత సమాచారం తెలుసుకోండి: