ఎంత గొప్ప వాడికైనా ఎదో ఒక సమయంలో బ్యాడ్ పిరియడ్ వస్తూ ఉంటుంది. అప్పుడు శని పట్టిందనో, మరొక కారణంతోనో గుళ్ళు గోపురాలు తిరుగుతూ సరిపెట్టుకుంటూ ఉంటారు. ప్రస్తుతం పూరి పరిస్థితి కూడా అలాగే ఉందా అని అనిపిస్తోంది. వరుసగా హిట్లు కొట్టాలని గత సంవత్సర కాలంగా పూరి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అయితే అతనిని ఫ్లాపులు వెంటాడుతూనే ఉన్నాయి.

పోనీ తన తమ్ముడు సాయి రామ్ శంకర్ ను పెద్ద హీరోగా చూద్దామని ప్రయత్నిస్తున్నా ఆ ప్రయత్నాలు విజయవంతం కాలేదు. కనీసం తేజా సినిమా 1000 అబద్దాలతో అయినా తన తమ్ముడు కెరియర్ గాడిలో పడుతుంది అనుకుంటే తేజా తీసిన 1000 అబద్దాలు సినిమా అవుట్ పుట్ సరిగ్గా రాలేదని వార్తలు వస్తున్నాయి. దీనితో ఈ సినిమా పై కూడా ఆశలు వదులుకున్నాడట. పోనీ రాజకీయాల పై దృష్టి పెట్టి తన భార్యకు కానీ, తన తమ్ముడుకు కానీ పాయకరావుపేట నియోజకవర్గం లో వచ్చే ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలుద్దాం అంటే అక్కడ కూడా ప్రస్తుతం విశాఖపట్నం జిల్లాలో దాడి వీరబధ్ర రావు, కొణతల రామకృష్ణ ల గ్రూప్ తగువుల వల్ల పూరి కుటుంబానికి ఎం ఎల్ ఎ టికెట్ వచ్చే అవకాశాలు లేవంటున్నారు.

 పోనీ పెద్ద హీరోలు ప్రభాస్, బన్నీ మహేష్ లతో మరో భారీ చిత్రం  తీద్దాం అనుకుంటే వారెవ్వరు ప్రస్తుతం ఖాళీగా లేరు. ఇటువంటి పరిస్థుతుల నేపధ్యంలో పూరీ జగన్నాద్ కు శని పట్టిందా అంటూ సెటైర్లు వినపడుతున్నాయి పూరికి త్వరలో మంచి రోజులు వస్తాయని ఆశిద్దాం.... 

మరింత సమాచారం తెలుసుకోండి: