నటుడు కాదు. అభిమానులకు దేవుడు కూడా. రాముడు, కృష్ణుడు అనగానే ఛటుక్కున గుర్తొచ్చేది ఆయనే. గుళ్లు గోపురాలూ కట్టించుకోనే అర్హత... తెలుగు నాట ఉన్న ఏకైక నటుడు ఎన్టీఆర్.అందుకే ఓ అభిమాని ఎన్టీఆర్ కోసం ఓ గుడిని ప్రతిష్ఠిస్తున్నాడు. పెన్మత్చ శ్రీనివాసులు అనే ఎన్టీఆర్ అభిమాని చిత్తూరు జిల్లా, తొట్టెంబేడులో ఎన్టీఆర్ కోసం ఓ గుడి కడుతున్నాడు. దాదాపు 80 శాతం పనులు పూర్తయ్యాయి. ఎన్టీఆర్ విగ్రహం కూడా తయారైంది.
కానీ గత కొంతకాలంగా ఈ గుడికి సంబంధించిన పనులు ఆగిపోయాయి. కారణం నిధులు లేకపోవడమే.అందుకే.. ఆ ఎన్టీఆర్ అభిమాని.. సహాయ సహకారాల కోసం ఎదురుచూస్తున్నాడు. ఎవరైనా ముందుకొచ్చి చేయూత నిస్తే.. గుడి నిర్మాణం పూర్తిచేస్తాడట. నిజంగా ఈ గుడి పూర్తయితే - తారకరాముని ఘనతలో మరో కలికితురాయి చేరినట్టే.