చూడడానికి పిట్టలా కనిపించే నిత్యామీనన్ పెద్దపెద్ద మాటలే చెబుతోంది.  గుండె జారి గల్లంతయ్యిందే హిట్టయ్యాక ఈ సౌండ్ మరీ ఎక్కువయ్యింది అంటున్నారు. సినిమా కథ  చెప్పడానికి డైరెక్టర్ వస్తే ముందు రెమ్యునరేషన్ యాభై లక్షలు అని చెబుతోందట. అయినా ఫర్వాలేదులే అని కొందరు స్థోమత ఉన్న నిర్మాతలు ఓకే చేస్తున్నారు. అందుకో ఏమో తనకు తిరుగు లేదన్నట్టు మాట్లాడుతోంది నిత్యామీనన్.

గుండెజారి సినిమా విజయం సాధించినా తనకు ఎవరూ ఫోన్లు చేయడం లేదని బాదపడిపోవడమే కాకుండా మండిపోతోంది. టాలీవుడ్ మొత్తం హీరోల చుట్టూనే తిరుగుతోంది, హీరోయిన్లు పేరుకు మాత్రమే అంటూ లెక్చర్లు. ఇస్తోందట. దానితో ఆగిపోతే ఫర్వాలేదు. ఈ పరిస్థితిని మార్చేస్తానంటోందట. ఇకముందు తన కోసం పాత్రలు సృష్టించేలా కధను తయారు చేయిస్తానని, అదరూ తనను వెతుక్కుంటూ వచ్చేలా కూడా చేస్థానానని చెపుతోందట . ఆమె మాటలు విని అందరూ నోళ్లు వెళ్లబెడుతున్నారు .

అంతేకాదు టాలీవుడ్ లో నటన తెలిసిన హీరోయిన్లెవరూ లేరట, అంటూ సెటైర్లు కూడా వేస్తోంది. ఆమె పద్ధతి చూసి అందరూ విసుక్కుంటున్నారని టాక్. కాస్త రెండు సినిమాలు హిట్టయ్యేసరికి ఈ పిల్లకి బాగా తలకెక్కినట్టుంది, అందుకే ఇలాంటి పిచ్చి వాగుడు వాగుతోంది అంటున్నారు. అయినా ఏం సాధించేసిందని నిత్య ఇలా మాట్లాడుతోంది! చూస్తుంటే తన కెరీర్ కి తనే ఎసరు పెట్టుకునేలా ఉంది గోల్డెన్ లెగ్ హీరోయిన్ అని పేరు తెచ్చుకున్న కాజల్ కే టాటా టాలీవుడ్ ఫీల్డ్ ఇది. కాబట్టి నిత్య కొంచెం జాగ్రత్తగా అడుగులు వేయడం ఆమెకు మంచిది. 

మరింత సమాచారం తెలుసుకోండి: